Thursday, November 7, 2013

కొంచం విలువలు, సాంప్రదాయాలని మన పిల్లలకి వారసత్వంగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మన భారత మాత వీరుల కోసం మరియు వీరమాతల కోసం వేచిచూస్తుంది..

రెండేళ్ళ పిల్లవాడికి కూల్ డ్రింక్ తాపుతున్న తల్లితండ్రులు, నాలుగేళ్ల పిల్ల వాడికి కెఎఫ్ సి లో చికెన్ తినిపిస్తున్న తల్లి తండ్రులు, ఏడు ఏళ్ళ పిల్లవాడు టాబ్లెట్ మీద గుద్దుకునే ఆటలు, తొమ్మిదేళ్ళ పిల్ల వాడు ఫెరారీ కారు నడపడం, పన్నెండు యేండ్ల పిల్లవాడు రోజు పేస్ బుక్ తో గడపడం, 15 ఏళ్ళకే కంప్యూటర్/మొబైల్ లో నీలి చిత్రాలు చూడటం. డబ్బు సంపాదించినంత మాత్రాన ఇవన్ని చెయ్యలా, వారిని అదుపులో పెట్టుకోలేమా, జీవితం అంటే కేవలం డబ్బెనా?

పిల్లలకు ఎలాంటి సమాజాన్ని మనం ముందు ముందు ఇవ్వబోతున్నాం, ఒబెసిటి, రోగాలు, అసూయ, ద్వేషం, హత్యలు, అత్యాచారాలు, మోసాలు, మరింత పెరగటానికి దోహదం చెయ్యటం లేదా? రోజు రోజు కి మనుషుల మధ్య అంతరం పెరిగిపోతుంది, ఇది పెరిగే కొద్ది అసహన, ద్వేషం పెరిగి సమతుల్య దెబ్బ తింటుంది. పిల్లల భవిష్యత్తు తీర్చి దిద్దటంలో తల్లి తండ్రులది 50% శాతం, గురువులది 40%శాతం, 10% శాతం సమాజానిది. ఏదో పెళ్లి చేసుకున్నాం పిల్లలు పుట్టారు పెంచుతున్నాం అని భావించకండి, పిల్లల పట్ల పాషన్ వుండాలి, మీ పిల్లల జీవితాలను మిరే నాశనం చెయ్యకండి. ప్రతి దానికి కొన్ని హద్దులు వున్నాయి, వాటిని దాటకుండా పెంచే ప్రయత్నం చేద్దాం..

కొంచం విలువలు, సాంప్రదాయాలని మన పిల్లలకి వారసత్వంగ ఇద్దాం. మన పిలల్లని మరో భగత్ సింగ్, వివేకానంద, అబ్దుల్ కలాం లా తీర్చిదిద్దుదాం..
చదువు చదువు అని రేపటి మన పౌరులని పిచ్చివాళ్ళుగా చేయకండి..
మీ పిల్లలని స్వార్థ పరులుగా, అవినీతి పరులుగా, లంచగొండులుగా, మూర్ఖులుగా , చెడు వ్యసన పరులుగా, కాకుండ దేశభక్తులుగా, సేవతత్పరులుగా, ఆరొగ్యవంతమైన రేపటి భావి భారత పౌరులుగా పెంచండి..
ప్రస్తుత సమయం లో మన దేశానికి పవిత్రత తో ధీరులైన, ఆరొగ్యవంతులైన సంతానం అవసరం..
మన భారత మాత వీరుల కోసం మరియు వీరమాతల కోసం వేచిచూస్తుంది..

చివరిగా.. మన పిలల్లని కేవలం మన కోసం కాకుండ సమాజం కోసం, దేశం కోసం మంచి పౌరులుగా పెంచుదాం...

నిజమైన భారతీయ తల్లితండ్రులుగా మీ పిల్లలని పెంచి భరత మాత కీర్తిని పెంచే పౌరులని అందిస్తారని, మీ పిలల్లని భారత రత్నాలుగా తయారు చేస్తారని ఆశిస్తూ..

"భారత్ మాత కి జై" .. "నవ యువ భారత్ సదా జై"...

**జై హింద్**

No comments: