Thursday, November 14, 2013

మధ్యాహ్న నిద్ర మంచిదేనంటున్న ఆరోగ్య నిపుణులు!

చాలా మందికి మధ్యాహ్నం పూట కాస్త కునుకుతీయటం అలవాటు. ఇంటి పట్టున ఉండేవారు మాత్రమే కాకుండా ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసే వారు కూడా తమతమ సీట్లలో పది నిమిషాల పాటు కునుకుతీస్తుంటారు. అలా 10 -20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకున్నట్టయితే, వారు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.

అయితే, కొన్ని కొలువుల్లో ఇలాంటి అవకాశం లభించనే లభించదు. ఇలాంటి వారి శరీరం అలసటకు గురవుతుందని చెపుతున్నారు. దీన్ని తట్టుకునేందుకు టీ తాగడం, చిరు తిండ్లు ఆరగించడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీర బరువు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

అందువల్ల ఆఫీసుల్లో పని చేసే సిబ్బంది కూడా పది నిమిషాల పాటు తమ కుర్చీల్లోనే నిద్రపోయినట్టయితే వారు తమ విధుల్లో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

No comments: